Read more!

English | Telugu

ప్రారంభమైన ఎన్టీఆర్ గారేజ్


 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో 'జనతా గారేజ్' అనే ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం గత ఏడాది October 25 న  హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో, చిత్ర బృందం నడుమ జరిగింది. 'నాన్నకు ప్రేమతో' చిత్రం తో భారి బ్లాక్బస్టర్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సరికొత్త లుక్ తో ఈ చిత్రం లో కనిపించనున్నారు.  ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్, గుణాజీ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ....  "యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా ఆయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. ఫిబ్రవరి 22న షూటింగ్ ను ప్రారంభించి, ఆగష్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని తెలిపారు.