Read more!

English | Telugu

హీరో నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

యువ హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. గత ఏడాది విడుదలైన 'మంత్ ఆఫ్ మధు' సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు ఈ పురస్కారం లభించింది.

భారతీయ చిత్ర పరిశ్రమకు పితామహుడుగా చెప్పుకోదగిన దాదాసాహెబ్ ఫాల్కే పుట్టినరోజు ఏప్రిల్ 30న ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా అనేకమంది కళాకారులు పోటీ పడుతూ ఉంటారు. మనదేశంలో ప్రతి ఏడాది విడుదలయ్యే  చిత్రాలు, వివిధ విభాగాలలో పోటీపడుతాయి. అందులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి నిర్వాహకులు ఈ పురస్కారాలను అందిస్తారు.  2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కడం విశేషం.

2011లో 'అందాల రాక్షసి' సినిమా ద్వారా పరిచయమైన నవీన్ చంద్ర.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాలలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' వంటి పాన్ ఇండియా చిత్రంతో పాటు అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన 'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అలరిస్తోంది.