Read more!

English | Telugu

హనుమాన్ నిర్మాత మెగా మేనల్లుడుతో 1940 లోకి వెళ్ళబోతున్నాడా!

ఒక్క అవకాశం..ఒకే ఒక్క అవకాశం.. సినిమా ఇండస్ట్రీలో తరచు వినపడే మాట.ఎందుకంటే  ఆ ఒక్క అవకాశం వస్తే తెలుగు సినిమాని ఏలవచ్చు. ఈ మాట హీరోకి, హీరోయిన్ కే కాదు.. నిర్మాతకి  కూడా వర్తిస్తుంది. వాస్తవానికి ఆ విషయం మరుగున పడిపోయింది. ఇప్పుడు దాన్ని బయటకి తెచ్చిన వ్యక్తి నిరంజన్ రెడ్డి (niranjan reddy) ఈయన ఎవరో కాదు  హనుమాన్ (hanuman)మూవీ నిర్మాత. ఒక్క అవకాశంతో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించాడు. తాజాగా ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. 

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) నిరంజన్ రెడ్డి కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. పైగా ఇంట్రెస్టింగ్ న్యూస్  ఏంటంటే 1940 వ దశకంలో జరిగే  పీరియాడిక్  కథ అని తెలుస్తుంది. ఆల్రెడీ నిరంజన్ రెడ్డి, తేజ్ లు మీట్ అయ్యారని  ప్రాజెక్ట్  గురించి  త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. సోషల్ మీడియా లో వస్తున్న ఈ వార్తలతో  నిరంజన్ రెడ్డి ఇంకో  కొత్త ప్రపంచం చూపించడం గ్యారంటీ అనే మాటలు అందరి నుంచి  వినిపిస్తున్నాయి. ఒక కొత్త దర్శకుడు ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు

 

 ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి  నిర్మించిన హనుమాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరకి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మోత మోగించింది. అందుకు  నిరంజన్ రెడ్డి కూడా ఒక కారణం అని   చెప్పవచ్చు. ఒక రకంగా ఆయన లేనిదే ఆ ప్రాజెక్ట్ లేదు. అప్పటివరకు పెద్దగా  హిట్లు లేని ప్రశాంత వర్మ ని నమ్మి భారీ వ్యయంతో హనుమన్ ని  నిర్మించి పెద్ద సాహసమే చేసాడు..అలాగే ఎన్ని ఆటంకాలు ఎదురైనా రిలీజ్ చేసి తన సత్తా చాటాడు. ఇక సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష, బ్రో సక్సెస్ ల తో మంచి ఊపు మీద ఉన్నాడు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్  చేస్తున్నాడు. కాకపోతే కొన్నాళ్లుగా మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు