Read more!

English | Telugu

ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ అంటే!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర'(Vishwambhara). ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.

'విశ్వంభర' సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్ గా నిలవనుందట. ఇంటర్వెల్ ఫైట్ కి థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెబుతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ చిత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. 54 అడుగుల హనుమంతుని విగ్రహంతో కూడిన భారీ సెట్ లో గత 26 రోజులుగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారట. ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 26 రోజులు కేటాయించారంటే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా మెగాస్టార్ లాంటి బడా హీరోకి ఆ రేంజ్ ఇంటర్వెల్ పడితే.. బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

కాగా, ఇటీవల 'విశ్వంభర' ఇంటర్వెల్ చిత్రీకరణ సమయంలో లొకేషన్ కి పవన్ కళ్యాణ్ వెళ్లడం విశేషం. ఆ సందర్భంగా విడుదల చేసిన ఫొటోలతో చిరంజీవి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

'విశ్వంభర'లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.