Read more!

English | Telugu

అవార్డ్ మనీ ని బాలకృష్ణ హాస్పిటల్ కు ఇచ్చేసిన క్రిష్..!

కంచె సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు క్రిష్. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నారు క్రిష్. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె ఎంపికైంది. ఈ అవార్డ్ తో పాటు ఇచ్చిన డబ్బును, బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చేశారు క్రిష్. ఆయన తల్లితో పాటు, ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఈ హాస్పిటల్ అత్యుత్తమమైన సేవలు అందిస్తోందని, అందుకే ఈ అవార్డు మనీని హాస్పిటల్ కు విరాళంగా ఇస్తున్నానని ఆయన తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ప్రకటించారు. కాగా బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిని క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన సన్నిహితుడైన రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా శాతకర్ణి తెరకెక్కుతుండటం విశేషం.