Read more!

English | Telugu

ముంబై డంపింగ్ యార్డ్ లో అగ్ర హీరో ధనుష్

విభిన్న సినిమాలకి, విభిన్న గెటప్ లకి  కేర్ ఆఫ్ అడ్రస్స్ తమిళ సూపర్ స్టార్ ధనుష్. ఒక్క తమిళనాడులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు.మొన్న ఈ మధ్య  కెప్టెన్ మిల్లర్ తో అలరించాడు.సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఒక పాత్ర కోసం ఆయన పడే కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు ఈ విషయం మీదే వార్తల్లో నిలిచాడు

ధనుష్ నయా మూవీస్ లో కుబేర ఒకటి.  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ముంబై లోనే అతి పెద్ద  పెద్ద డంప్ యార్డ్  అయిన డియోనార్ డంపింగ్ యార్డ్ లోధనుష్ మీద కొన్ని  కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.అవి సినిమాకి ఆయువు పట్టు లాంటివి. దీంతో సన్నివేశాలు బాగా రావడం కోసం ధనుష్ ఏకంగా 10 గంటలపాటు డంపింగ్ యార్డ్ లోనే ఉన్నాడు.పైగా ఎటువంటి  మాస్క్ లేకుండానే షూట్ లో పాల్గొంటున్నాడు. మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో పలువురు ధనుష్ కి సినిమా పట్ల, నటన పట్ల ఉన్న కమిట్మెంట్ ని పొగుడుతున్నారు. అలాగే అందుకు సంబంధించిన ధనుష్ లుక్ నెట్టింట హల్ చేస్తుంది

యువసామ్రాట్ కింగ్ నాగార్జున తో కలిసి మొట్టమొదటి సారి ధనుష్ మల్టి స్టారర్ చేస్తున్నాడు. పైగా తెలుగులో డైరెక్ట్ గా నటించడం ఇదే మొదటి సారి. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన  నాగార్జున లుక్ తో సినిమా రేంజ్ అర్ధమయిపోయింది. హిట్ చిత్రాల హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా  చేస్తుంది. మూవీలో తన పాత్ర చాలా స్పెషల్ అని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.పాన్  ఇండియా ప్రేక్షకులు కుబేర కోసం వెయిటింగ్