English | Telugu

డివైడ్ టాక్ తోనూ కలెక్షన్ల సునామీ.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న కూలీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రం 'కూలీ'. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ వచ్చినా, పోటీగా 'వార్-2' ఉన్నా.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

మొదటి రోజు రూ.151 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన కూలీ.. తాజాగా మరో ఘనత సాధించింది. నాలుగు రోజుల్లోనే రూ.404 కోట్లు కలెక్ట్ చేసి.. తమిళ సినీ చరిత్రలో వేగంగా 400 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.600 కోట్ల గ్రాస్ దాకా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ.. నిజానికి 'కూలీ'పై నెలకొన్న హైప్ కి ఇంకా వండర్స్ క్రియేట్ చేయాల్సింది. కానీ, పోటీగా 'వార్-2' ఉండటం, సినిమాకి డివైడ్ టాక్ రావడం, వర్షాల ప్రభావం.. వంటి కారణాల వల్ల 'కూలీ' కలెక్షన్ల సునామీ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలున్నాయి. లేదంటే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసేదనే అంచనాలు ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.