English | Telugu

బిగ్ ట్విస్ట్.. కార్పొరేట్ బుకింగ్స్ తో 'కూలీ'కి హైప్!

కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట బాలీవుడ్ లో ఎక్కువగా వింటుంటాం. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ సౌత్ ఇండియాకు కూడా పాకిందని అంటున్నారు. 'కూలీ' సినిమా కోసం పెద్ద ఎత్తున కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Coolie Bookings)

ఆగస్టు 14న ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతుంది. ఆరోజు 'వార్-2', 'కూలీ' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2' బుకింగ్స్ స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఉండగా.. 'కూలీ' బుకింగ్స్ మాత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచే రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. కూలీకి కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్ కోసమని మొత్తం థియేటర్లనే బుక్ చేస్తున్నట్లు ఒక థియేటర్ యజమాని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. (Coolie vs War 2)

కార్పొరేట్ బుకింగ్స్ అంశం తెరపైకి రావడంతో ఇతర హీరోల అభిమానులు 'కూలీ' సినిమాని టార్గెట్ చేస్తున్నారు. హైప్ ని క్రియేట్ చేయడానికి కార్పొరేట్ బుకింగ్స్ ని నమ్ముకున్నారని లేదంటే ఈ రేంజ్ బుకింగ్స్ అసలు సాధ్యం కాదని కొందరు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.