English | Telugu

వరుణ్ సందేశ్ మాస్ అవతార్.. 'కానిస్టేబుల్' ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!

హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం "కానిస్టేబుల్" తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న ఆశాభావాన్ని వరుణ్ సందేశ్ వ్యక్తం చేశారు.

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక వారణాసి హీరోహీరోయిన్లుగా బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్". దీనికి ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. "ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31న రిలీజ్ చేశాం. నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. అందరి అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అని అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. "టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది" అని అన్నారు.


దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. "ట్రైలర్ విమర్శకుల మన్ననలు పొందుతూ దూసుకుపోతుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వస్తుండటంతో టీం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాగే మా సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హజరత్ షేక్ (వలి), ఎడిటర్స్ గా వర ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.