English | Telugu

కెమెరామెన్ విన్సెంట్ క‌న్నుమూత‌

సీనియ‌ర్ ఛాయాగ్ర‌హ‌కుడు ఎ.విన్సెంట్ (83) క‌న్నుమూశారు. కొద్ది సేప‌టిక్రితం ఆయ‌న‌ చెన్నైలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ప‌లు తెలుగు, త‌మిళ‌ హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ప‌నిచేశారాయ‌న‌. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అటు చాయాగ్ర‌హ‌కుడిగా, ఇటు ద‌ర్శ‌కుడిగా రెండు పాత్ర‌లు పోషించారుజ తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు చిత్రాల‌కు ఆయ‌న కెమెరామెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆప‌ద్భాంధ‌వుడు, బాబు, దేవ‌త‌, మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, అల్ల‌రిప్రియుడు, ఘ‌రానా మొగుడు, అన్న‌మ‌య్య‌... ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌నిచేశారాయ‌న‌. 1985 లోనే ఓ మ‌ల‌యాళ చిత్రం ద్వారా త్రీడీ ఎఫైక్ట్స్‌ని ప‌రిచ‌యం చేశారాయ‌న‌. ద‌ర్శ‌కుడి భావాల‌ను అనుగుణంగా క‌థ‌ని తెర‌పై క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కించ‌డంలో విన్సెంట్ ప్ర‌సిద్ధుడు. ఆయ‌న మ‌ర‌ణం.. యావ‌త్ చిత్ర‌సీమ‌కూ తీర‌ని లోటు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.