English | Telugu

బన్నీ భామతో చెర్రీ రొమాన్స్ కి సిద్దం

రాంచరణ్ హీరోగా "మిర్చి" దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా కేథరిన్ ను ఎంపిక చేశారు. "ఇద్దరమ్మాయిలతో" చిత్రంలో తన అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న కేథరిన్ ఈ చిత్రంలో మరింత అందాలను అరబోయనుందట. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఆగష్టు మూడో వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం చరణ్ "ఎవడు" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.