English | Telugu

విలేఖరికి పూరీ ఝలక్

విలేఖరికి పూరీ ఝలక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‍ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం గురించి మీడియాకు వివరించటానికి ఈ చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆ సమావేశంలో ముందుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రసంగిస్తూ ఉండగా ,ఒక విలేఖరి "మీ చిత్రంలో ఫలానా పాట వేరే భాషా చిత్రమలోని పాటకు కాపీ కదా" అని అడిగాడు.

దానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ కాస్త అసహనంగా "సార్ మనం తీసే సినిమా టెక్నాలజీనే మనది కాదు. అలాగే యారీ 3 కెమెరా తెలుగుది కాదు సార్. వేరే ఎవరో తయారు చేస్తే మనం వాడుకుంటుంన్నాం. అసలు సినిమాలే కాపీ కొడుతూంటే మీరు ఒక పాట కాపీ కొట్టటం గురించి మాట్లాతారేంటి...?సాంగ్స్ డోంట్ నీడ్ ఆర్గ్యుమెంట్స్ " అంటూ రివర్స్ లో వచ్చారు. ఎప్పుడూ చిరునవ్వుతో సహనానికి మారుపేరులా ఉండే దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్ ఇలా మాట్లాడటం మీడియాకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.