English | Telugu

"ప్రిన్స్ తో సినిమా చేస్తా"- రాజమౌళి

"ప్రిన్స్ తో సినిమా చేస్తా"నని రాజమౌళి అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నన చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో అపజయమెరుగని యువ దర్శకుడు రాజమౌళి ప్రసంగిస్తూ "తమిళ్ లో రజనీకాంత్ కి ఎంతమంది అభిమానులున్నారో అంతమంది మహేష్ బాబుకి కూడా తమిళ, మళయాళ భాషల్లో రావాలి. మహేష్ బాబుకి కూడా అంత మార్కెట్ ఉండాలి.

గతంలో ఆయనతో సినిమా చేయాల్సింది. ఎనౌన్స్ కూడా చేశాం. కానీ కొన్ని కారణాలవల్ల కుదరలేదు. తప్పకుండా ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తా...! అది కౌబాయ్ సినిమానా, అల్లూరి సీరామరాజు వంటి పీరియాడికల్ ఫిల్మా లేక గూఢచారి 116 వంటి యాక్షన్ సినిమానా అన్నది మీరే నిర్ణయించాలి" అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.