English | Telugu

ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" కి "ఎ" సర్టిఫికేట్

ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" కి "ఎ" సర్టిఫికేట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోలో, ట్రైలర్స్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తూంది.

ఈ ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" చిత్రం సెన్సారు కార్యక్రమాలు ముగించుకుంది. ఈ ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి సెన్సారు వారు "ఎ" సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. బహుశా డైలాగులు బాగా మాస్ స్టైల్లో ఉండటం రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్లనే అలా ఈ ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి "ఎ" సర్టిఫికేట్ ఇచ్చారని భావించాల్సి వస్తూంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.