English | Telugu

అల్ల‌రోడి ఆరుకోట్లు మ‌టాష్‌

పాపం.. అల్ల‌రి న‌రేష్‌కి ఏదీ క‌ల‌సి రావడం లేదు. ఈ మ‌ధ్య ఒక్క హిట్టూ ప‌డ‌క‌... దిగాలుప‌డిపోయాడు. కామెడీ హీరోగా న‌రేష్ కి బోలెడంత పేరుండేది. మినిమం గ్యారెంటీ హీరో అని చెప్పుకొనేవారు. మూడు, నాలుగు కోట్ల‌తో సినిమా తీసి... ఓ కోటి వెన‌కేసుకొనేవారు ప్రొడ్యూస‌ర్లు. సినిమా ఎలా ఉన్నా.. లాభాలు మాత్రం వ‌చ్చేవి. చేతినిండా నాలుగైదు సినిమాల‌తో బిజీ బిజీగా ఉండేవాడు. కానీ ఆ వైభ‌వం ఏది??? హీరోగా ఎన్ని ప్ర‌యత్నాలు చేస్తున్నా బెడ‌సికొడుతున్నాయి. న‌రేష్ న‌వ్వించ‌లేక‌పోతున్నాడు. పోనీ ప్ర‌యోగాలు చేద్దామ‌నుకొంటే చేతులు కాలిపోతున్నాయ్‌. ల‌డ్డూ బాబు చూశారు క‌దా.. ఎంత చేదుగా ఉందో..?? కాస్త క్లాసీటా ఉంటుంద‌ని బందిపోటు తీస్తే.. అదీ లాసొచ్చింది. ఈ సినిమాకి న‌రేష్ వి రూ.6 కోట్లు పోయాయ‌ట‌. సొంత నిర్మాణ సంస్థ ఈవీవీ సినిమాపై తీసిన సినిమా ఇది. పారితోషికం ప‌క్క‌న పెట్టి సినిమా తీస్తే ఆరు కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. తీరా సినిమా పూర్త‌య్యాక ఎవ‌రూ కొన‌లేదు. ఇంద్ర‌గంటి పేరూ ఎవ్వ‌రినీ ఆక‌ర్షించలేదు. శాటిలైట్ అమ్ముడుకాలేదు. మొత్తానికి న‌రేష్ ఓన్ రిలీజ్ చేసుకొన్నాడు. కానీ రెండో రోజు నుంచే డెఫ్ షీట్స్ మొద‌ల‌య్యాయి. థియేట‌ర్ల కు అద్దెలు ఎదురిచ్చాడు. సోమవారం నుంచి నావ‌ల్ల కాద‌ని చేతులు ఎత్తేశాడు. దాంతో బందిపోటు న‌రేష్ కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. సినిమా టాక్ చూసి న‌రేష్ కూడా ప‌బ్లిసిటీ గురించి ప‌ట్టించుకోలేదు. ఈ సినిమాకి ఎంత చేసినా వేస్టే అనుకొన్నాడేమో.. ఆ త‌ర‌వాత రూపాయి కూడా బ‌య‌ట‌కు తీయ‌లేదు. న‌రేష్ ఇప్పుడు సిందిగ్థావ‌స్థ‌లో ఉన్నాడు.. న‌వ్వించ‌లేక‌పోతున్నాడు. అలాగ‌ని సీరియ‌స్ - క్లాసీ సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు చూడ‌డం లేదు. న‌రేష్ కి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. మ‌ళ్లీ త‌న‌దైన దారిలో వెళ్లి, త‌న‌కు న‌ప్పే క‌థ‌ల్ని, స‌రికొత్త కామెడీ యాంగిల్‌తో చూపిస్తే త‌ప్ప జ‌నం చూడ‌రు. మ‌రి ఈ ప్ర‌మాదం నుంచి న‌రేష్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో ఏంటో??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.