Read more!

English | Telugu

నర్తనశాల రీమేక్ తప్పక చేస్తా - నందమూరి బాలకృష్ణ

"నర్తనశాల తప్పక చేస్తా"నని యువరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు. వివరాల్లోకి వెళితే గతంలో సీనియర్ యన్.టి.ఆర్., సావిత్ర, యస్.వి.ఆర్. తదితర హేమా హేమీలు నటించిన అద్భుత పౌరాణికకళాఖండం "నర్తనశాల". ఈ చిత్రం ఇప్పటికీ పౌరాణిక చిత్రాల్లో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఆ మధ్య సౌందర్య ప్రథాన పాత్రలో నటిస్తుందని, తాను నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నందమూరి బాలకృష్ణ, రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.

 

కాని నటి సౌందర్య అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవటం, అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు కాలికి దెబ్బతగలటం వంటి అపశకునాలు ఎదురవటంతో ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ ఆపాల్సివచ్చింది. కానీ ఇటీవల ఒక ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవానికి హాజరైన నందమూరి బాలకృష్ణ " నేను ఈ నర్తనశాల చిత్రాన్ని నా దర్శకత్వంలో తప్పక తీస్తాను. ఈ నర్తనశాల చిత్రం నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేసిందంటే ఆ చిత్రం స్క్రిప్ట్ లోని కీచకుడి డైలాగ్ ఇంకా నాకు గుర్తుంది" అంటూ ఆ కీచకుడి అతి పెద్ద డైలాగ్ ని చెప్పి అక్కడి ప్రేక్షకులను అలరించారు.