English | Telugu

ప‌వ‌న్, అనుష్క‌... కాంబో??

త్రివిక్ర‌మ్ ఇప్పుడు మ‌హేష్ బాబు కోసం స్ర్కిప్టు రాసుకొనే ప‌నిలో ఉన్నాడు. అయితే స‌మాంత‌రంగా `కోబ‌లి`కి సంబంధించిన చ‌ర్చ‌లూ సాగిస్తున్నాడ‌ట‌. మ‌హేష్ బాబు తో సినిమా పూర్త‌వ్వ‌గానే కోబ‌లిని ప్రారంభించాల‌ని ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలిసింది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎవ‌రైతే బాగుంటారు? అనే విష‌యంపై కూడా ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింద‌ట‌. త్రివిక్ర‌మ్ ఛాయిస్‌లో ఉన్న నాయిక అనుష్క మాత్ర‌మేన‌ట‌. ఈ విష‌యాన్ని ప‌వ‌న్‌కీ చెప్పాడ‌ట‌. ప‌వ‌న్ కూడా అనుష్క విష‌యంలో సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ - అనుష్కల కాంబినేష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ చూసే ఛాన్స్ ద‌క్క‌లేదు. మ‌రి ఆ అవ‌కాశం త్రివిక్ర‌మ్ క‌ల్పిస్తాడేమో చూడాలి. ఈ 2015 చివ‌ర్లో గానీ 2016 ప్రారంభంలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.