English | Telugu

లిప్పులాక్కుల్లో రెచ్చిపోయిన అనుష్క‌

వ‌రుస‌గా క‌త్తి ఫైట్లు, యుద్దాలు చేసి విసుగొచ్చిందేమో, డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై మోజు త‌గ్గిందేమో.. ఇప్పుడు గ్లామ‌ర్ క్వీన్‌గా అవ‌తారం ఎత్త‌డానికి తాప‌త్ర‌య‌ప‌డుతోంది అనుష్క‌. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లిలో పెద్ద‌గా త‌న గ్లామ‌ర్‌నిచూపించే స్కోప్ అనుష్క‌కు రాలేదు. బాహుబ‌లిలో అయితే `అమ్మమ్మ‌`గా క‌నిపిస్తోంది. రుద్ర‌మ‌దేవిలో క‌త్తి యుద్దాల‌కు త‌ప్ప‌, మ‌రో అంశానికి ప్రాధాన్యం లేకుండాపోయింది. అందుకే త‌దుప‌రి చిత్రం `సైజ్ జోరో`లో త‌న ముచ్చ‌ట్ల‌న్నీ తీర్చుకొంటోంది. ఈ సినిమాలో డీప్ లిప్ లాక్ స‌న్నివేశాలు రెండు మూడున్నాయ‌ట‌. వాటిలో అనుష్క చూపించిన స‌హ‌జ‌సిద్ద‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యువ‌త‌రాన్ని కిర్రెక్కిస్తుంద‌ని స‌మాచారం.

త‌మిళ న‌టుడు ఆర్య‌తో అనుష్క లిప్ లాక్ చేసిన స‌న్నివేశాల్ని ఇటీవ‌లే తెర‌కెక్కించారని, ఆ సీన్లో ఇద్ద‌రూ రెచ్చిపోయార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఇది వ‌ర‌కు అనుష్క‌, ఆర్య‌లు క‌లిసి వ‌ర్ణ చిత్రంలో న‌టించారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌న్న వార్తలొచ్చాయి. ప్రేమ కాదు.. మేం జ‌స్ట్ ప్రెండ్స్ అని చెప్పుకొన్నార‌ప్పుడు. అయితే ఇప్పుడు మాత్రం నిజ‌మైన ప్రేమికుల్లా... ఒక‌రి పెదాల్ని ఇంంకొక‌రు పిండేసుకొన్నార్ట‌. మ‌రి ఆ సీన్లు ఎలా పండాయో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.