English | Telugu

చిరంజీవి పై అల్లు అర్జున్ ట్వీట్.. మావయ్య నా సర్వస్వం అంటున్న మేనల్లుడు 

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్టాలతోపాటు, దేశ, విదేశాల్లో ఉన్న మెగా అభిమానులు చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికగా అభిమానులు భారీ ఎత్తున ఈవెంట్ ని జరిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ హీరో శ్రీకాంత్(Srikanth)తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొని, చిరంజీవి తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

రీసెంట్ గా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ఎక్స్(X)వేదికగా చిరంజీవి బర్త్ డే పై స్పందిస్తు 'హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటు ట్వీట్ చేసాడు. గతంలో చిరంజీవితో కలిసి డాన్స్ చేసిన పిక్ ని కూడా అల్లు అర్జున్ షేర్ చేసాడు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ట్వీట్ చేస్తు నేను చూసిన మొదటి హీరో మావయ్య, ఆయన జీవితం ఆదర్శం. మామ చేతి నడకే ఈ రోజు నా పయనం. మావయ్య నా సర్వస్వం. కష్టమైన సుఖమైనా కొండంత దైర్యం. మావయ్య మాటే శాసనం. ఎప్పటికి నా బలం. మీ మెగాస్టార్ మన మెగాస్టార్, నా ముద్దుల మావయ్య చిరంజీవి గారికి జన్మ దిన శుబాకాంక్షలని ట్వీట్ చేసాడు.

విక్టరీ వెంకటేష్(Venkatesth),తేజ సజ్జ, నారా రోహిత్, దర్శకుడు హరీష్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులుతో పాటు పలు రాజకీయ, వ్యాపార ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారిలో ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.