English | Telugu

క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'జవాన్' చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీని ఆ సినిమాలో అతిథి పాత్ర కోసం సంప్రదించడం నిజమే కానీ.. ఆయన ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

'పఠాన్' ఘన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇందులో సౌత్ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులోని ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం సౌత్ బిగ్ స్టార్ ని రంగంలోకి దింపాలని డైరెక్టర్ అట్లీ ప్రయత్నిస్తున్నాడు. మొదట కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు తెరమీదకు వచ్చింది. ఇటీవల 'జవాన్' టీమ్ ప్రత్యేక పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించారట. ఇది 15 నిమిషాల నిడివి గల పాత్ర అని టాక్. అయితే 'పుష్ప-2'తో బిజీగా ఉన్న బన్నీ ప్రస్తుతం తన దృష్టంతా ఆ చిత్రం మీదే ఉండాలన్న ఉద్దేశంతో 'జవాన్' ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో 'జవాన్' టీమ్ మరో సౌత్ స్టార్ ని వెతికే పనిలో పడిందట. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లను సంప్రదించే అవకాశముందని అంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.