Read more!

English | Telugu

రైటర్ గా మారిన అల్లరి నరేష్.. త్రివిక్రమ్ ని మరిపిస్తాడా!

కామెడీ హీరోగా అల్లరి నరేష్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. వాటిలో 'సుడిగాడు' ఒకటి. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం 2012 ఆగస్టులో విడుదలై మంచి వసూళ్లతో ఘన విజయం సాధించింది. దాదాపు 12 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ వెల్లడించాడు.

నరేష్ తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుడిగాడు సీక్వెల్ గురించి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నేను సుడిగాడు 2 కథ రాయడం మొదలు పెట్టాను. ఆ సినిమా వచ్చే ఏడాది మీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి." అని నరేష్ అన్నాడు.

సుడిగాడు అనేది పలు కమర్షియల్ సినిమాలకు స్పూఫ్ గా రూపొందిన చిత్రం. అలాంటిది ఈ మూవీ సీక్వెల్ కోసం నరేష్ రైటర్ గా మారడం ఆసక్తికరంగా మారింది. నరేష్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్ లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో సర్ ప్రైజ్ చేస్తాడు. అలాంటి నరేష్ 'సుడిగాడు 2' కథ రాస్తున్నానని చెప్పడంతో.. రీసెంట్ గా వచ్చిన ఏ సినిమాలను స్పూఫ్ చేయబోతున్నాడు?, ఎలాంటి కామెడీ ట్రాక్ లు రాయబోతున్నాడు? అనే ఆసక్తి నెలకొంది. యాక్టర్ గా తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించిన నరేష్.. రైటర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.