Read more!

English | Telugu

నేర్చుకున్నా కాబట్టి పట్టించుకోను..మోహన్ బాబు హీరోయిన్ కూతురు కదా 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా 1993 లో వచ్చిన మూవీ చిట్టెమ్మ మొగుడు. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ భామ పూజా బేడీ. ఆ తర్వాత 18 ఏళ్ళకి  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తీ లో కూడా చేసింది. ఆమె కూతురు పేరు  అలయ ఎఫ్. బాలీవుడ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ని పండించే హీరోయిన్లలో ఒకటి. 

అలయ  రీసెంట్ గా బడే మియాన్ చోటా మియాన్ లో చేసింది. సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో   తెరకెక్కింది. ఇందులో అలయ  డాక్టర్ పామ్ క్యారక్టర్ లో  సూపర్ గా నటించింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో బడే మియాన్ చోటా మియాన్  భారీ కలెక్షన్స్ ని సాధించడం లేదని కొంత మంది అడిగారు. దాంతో అదిరిపోయే సమాధానాలు ఇచ్చింది.  మూవీ ఆడినా ఆడకపోయినా పెద్దగా పట్టించుకోను.ఎందుకంటే  అప్పటికే ఆ చిత్రం నుంచి చాలా నేర్చుకొని ఉంటాను. 

పైగా కొత్త ప్రేక్షకులని కూడా చేరుకుంటాను. కొంత మంది సినిమా చూడకండానే రివ్యూలు ఇస్హారు. కాబట్టి వాటి విషయాల్లో టెన్షన్ పడను. అసలైన రివ్యూ ప్రేక్షకుల నుంచి వస్తుంది. నేను బాగా నటించానని కొంత మంది అంటే  మరి కొంత మంది చెత్తగా చేసానని అంటారు.ఇక్కడ  అందర్నీ మెప్పించడం ఎవరి వల్ల  కాదు.  కాకపోతే నా పాత్ర వరకు మనసు పెట్టి చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక బడే మియాన్ చోటా మియాన్ ఏప్రిల్ 11 న రిలీజ్ అయ్యింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రఫ్, పృథి రాజ్ సుకుమారన్, మానుషీ చిల్లర్ వంటి టాప్ స్టార్స్ అందులో ఉన్నారు. 350 కోట్ల బడ్జట్ తో తెరకెక్కగా ఇప్పటికీ  60 .65 కోట్ల రూపాయలని సాధించింది