Read more!

English | Telugu

మేము ఓటు వేశాం... మరి మీరు..?

గ్రేటర్ ఎలక్షన్లలో సినీతారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రజలందరూ కూడా ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.హీరోలు నాగార్జున, అల్లు అర్జున్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున, అల్లుఅర్జున్ లు ఓటు వేయమని తమ అభిమానులకు ట్విట్టర్ లో కూడా పిలుపునివ్వడం విశేషం.' నేను ఓటు వేశాను మీరు కూడా వేయండి అని నాగార్జున ' ట్వీట్ చేస్తే, ' ఓటు వెయ్యని వాళ్లకు నాయకుల్ని ప్రశ్నించే హక్కు కూడా ఉండదు ' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు..