English | Telugu

వార్-2 ట్రైలర్.. లెక్కలన్నీ తారుమారు!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్-2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలోని ఇద్దరు బిగ్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ట్రైలర్ కీలకంగా మారింది.

'వార్-2' ట్రైలర్ ఇప్పటికే లాక్ అయినట్లు తెలుస్తోంది. 2 నిమిషాల 39 సెకన్ల నిడివితో ట్రైలర్ ను రూపొందించారట. ట్రైలర్ కట్ అదిరిపోయిందని టాక్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తరువాత ఒక్కసారిగా సినిమాపై అంచనాలు మళ్ళీ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.

'వార్-2' నుంచి ఇప్పటిదాకా పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రాలేదు. టీజర్, కొన్ని పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకుంటే మాత్రం.. ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ కావడంతో.. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.