English | Telugu

వెంకీ "షాడో" కామెడీ ఎంటర్ టైనర్- కోన వెంకట్

వెంకీ "షాడో" కామెడీ ఎంటర్ టైనర్ అని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, తాప్సీ, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం"షాడో". ఈ "షాడో" చిత్రం ఇటీవల రామానాయుడు స్టుడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ చిత్రం గురించి ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ లో ఈ విధంగా రాశారు.

"షాడో చిత్రంలో హీరో విక్టరీ వెంకటేష్ మాఫియా డాన్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర మాఫియా డాన్ గా సీరియస్ ఉంటూనే, నవ్విస్తూంటుందట. ఈ "షాడో" చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది." ఈ మాటలను బట్టి చూస్తే ఈ "షాడో" చిత్రం ష్యూర్ షాట్ హిట్టనిపిస్తుంది. అనిపించటమేమిటి...అవ్వాలని ఆశిద్దాం...

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.