English | Telugu

నేను - నా రాక్షసి హిట్టవుతుంది- ఇలియానా

"నేను-నా రాక్షసి" హిట్టవుతుంది అని ఇలియానా అంటూందట. వివరాల్లోకి వెళితే యువ హీరో దగ్గుబాటి రానా హీరోగా, నలక నడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), నిర్మిస్తున్న చిత్రం" నేను-నా రాక్షసి". ఈ "నేను-నా రాక్షసి" మూవీ గురించి హీరోయిన్ ఇలియానా చాలా ఆశతో ఉంది. ఈ "నేను-నా రాక్షసి" చిత్రం కచ్చితంగా హిట్టవుతుందని అంటూంది ఇలియానా.


గతంలో మంచు విష్ణువర్థన్ హీరోగా, వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన "సలీం" చిత్రంలో, నితిన్ హీరోగా నటించిన "రెచ్చిపో" చిత్రంతో పాటు ఇటీవల యన్ టి ఆర్ హీరోగా నటించిన "శక్తి" చిత్రంలో కూడా ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూడు చిత్రాలూ ఫ్లాపులుగా మారటంతో, ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న "నేను - నారాక్షసి" చిత్రం మీదే ఇలియానా ఆశలన్నీ పెట్టుకుంటుంది.


వరసగా ముడు ఫ్లాపులిచ్చినా కూడా ఇలియానాకున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోవటం విశేషం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని "3ఇడియట్స్" చిత్రం రిమేక్ లో ఇలియానా నటిస్తూంది. ఈ చిత్రంలో నటించటానికి ఇలియానా రెండు కోట్లు పారితోషికం తీసుకుందట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.