English | Telugu

సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ !!

ఓ దశాబ్ధంపాటు తెలుగు, తమిళ వెండితెరలపై వేడి పుట్టించి.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు కాలక్షేపం అందిస్తున్న సిమ్రాన్.. త్వరలోనే సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్‌‍కు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలుగులో "సమరసింహారెడ్డి", "నరసింహనాయుడు", నువ్వు వస్తావని", "కలిసుందాం రా" వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ కలిగిన సిమ్రాన్‌కు.. తమిళంలోనూ అంతే స్థాయిలో హిట్స్ ఉన్నాయి.

కమల్‌హాసన్‌తో కొన్నాళ్లు "సహజీవనం" చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని.. సినిమాలకు "కామా" పెట్టింది. ఆ మధ్య ఒకటీ, అర చిత్రాల్లో నటించినప్పటికీ, అవి సిమ్రాన్ రేంజ్‌కి తగినవి కాకపోవడంతో ఆమె అభిమానులకు రుచించలేదు. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లోని కొన్ని రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సిమ్రాన్.. అతి త్వరలో ఓ లేడి ఓరియంటెడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పరిశ్రమ వర్గాలకు సంకేతాలు పంపిన సిమ్రాన్.. తన రూప లావణ్యాలకు సైతం మునుపటి వైభవం అద్దేందుకు అవసరమైన చర్యలు (వ్యాయామాలు, యోగా వంటివి) చేపట్టిందని తెలుస్తోంది. మరి సిమ్రాన్ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.