English | Telugu

రేసుగుర్రం ఎక్కనున్న సలోని

"మర్యాద రామన్న" చిత్రం తర్వాత సలోని నటించిన ఏ ఒక్క చిత్రం కూడా చెప్పుకోదగ్గ హిట్లు సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు కన్నడ సినిమా వైపు దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో ఏదైనా మంచి సినిమా అవకాశాలు దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్న సలోనికి అనుకోకుండా అవకాశం వచ్చింది.

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న "రేసుగుర్రం" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ సలోని కొట్టేసింది. ఈ చిత్రంలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా అయిన సలోనికి వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.