English | Telugu

మొన్న మహేష్, నేడు రాజమౌళి.. ధమ్ ధమ్ చెయ్యొద్దు!

కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా మే 26న విడుదలై పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుని, దర్శకధీరుడు రాజమౌళిని మెప్పించడం విశేషం.

'మేమ్ ఫేమస్' విడుదలకు ముందుగానే స్పెషల్ షో చూసిన మహేష్.. సినిమా అదిరిపోయిందని టీమ్ ని ప్రశంసిస్తూ విడుదలకు కొద్ది గంటల ముందు ట్వీట్ చేశాడు. ఇక సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత టీం ని ప్రశంసిస్తూ తాజాగా రాజమౌళి కూడా ట్వీట్ చేశాడు. "చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. సుమంత్ కోసం ఈ సినిమా చూడండి. నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. సినిమాలో అన్ని పాత్రలను చక్కగా మలిచారు. నటీనటులు సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ ఆకట్టుకున్నాడు. ఇది అందరూ చూడదగ్గ చిత్రం" అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అంతేకాదు 'మేమ్ ఫేమస్'లోని "యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. ధమ్ ధమ్ చెయ్యొద్దు" అనే డైలాగ్ ని కూడా ఆయన ట్వీట్ లో జోడించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.