English | Telugu

నా చావుకి రాజమౌళి కారణం..ఒక మహిళ విషయంలోనేనా! 

సినిమా సినిమాకి తను ఎదగడమే కాకుండా,తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి.(Rajamouli)స్టూడెంట్ నెంబర్ వన్' తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఆర్ ఆర్ ఆర్ వరకు అప్రహాతీతంగా కొనసాగుతూ ముందుకు వెళ్తుంది.ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తన కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.


రీసెంట్ గా రాజమౌళి టార్చర్ భరించలేక చనిపోతున్నానని,అందుకే చనిపోతున్నానని,ఇదే నా మరణ వాంగ్మూలం అంటు ఉప్పలపాటి శ్రీనివాస్రావు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చెయ్యడంతో పాటు ఒక లెటర్ ని కూడా రాసాడు.అందులో పలు సంచలన విషయాలని రాసుకొచ్చాడు.రాజమౌళి,నాది 34 ఏళ్ళ స్నేహం.ఈటివి లో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చెయ్యక ముందు నుంచే ఇద్దరం ఫ్రెండ్స్.ఈ విషయం అందరకి తెలుసు.యమదొంగ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను నేను చేశాను.కానీ రాజమౌళి జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించడంతో రాజమౌళి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసాడు.ఆ మహిళది నాది,ట్రయాంగిల్ లవ్ స్టోరీ, నేను రాజమౌళి కోసం త్యాగం చేశాను. రాజమౌళి వల్లే 54 ఏళ్ళు అయినా బ్యాచలర్ గా ఉన్నాను ఆయన నెంబర్ వన్ గా ఎదగడం కోసం నా జీవితాన్నే నాశనం చేసాడు.రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని,నేను ఇండస్ట్రీ లో లేకుండా చేసాడు.చివరకి నేను చనిపోయే దాకా తెచ్చాడు.పోలీసులు కేసు ఫైల్ చేసి ఆ ఇద్దరికి లై డిటెక్టర్ టెస్ట్ చెయ్యాలి.

రాజమౌళి క్షుద్ర విద్యలని నేర్చుకున్నాడు.అతనికి యాంటీ గా ఉన్న డైరెక్టర్స్ మీద క్షుద్ర పూజలు చేసి తానే నెంబర్ వన్ డైరెక్ట్ అయ్యాడని, కూడా ఆ డైరెక్టర్ల పేరులు కూడా లెటర్ లో రాసుకొచ్చాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.