English | Telugu

ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు.. మరో ఉద్యోగం చేసుకునే దాన్ని 

సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి చిత్రాలతో దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకులని అలరించిన నటీ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth).ఈ చిత్రాల్లో 'ప్రియ' అనే క్యారక్టర్ లో 'రుక్మిణి' నటించిన తీరు తెలుగు ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విజయం ఇచ్చిన గుర్తింపుతోనే, ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో రుక్మిణి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీలో 'రుక్మిణి' నే హీరోయిన్ అనే టాక్ చాలా బలంగా ఉంది. ఇక ఈ నెల 5 న తన కొత్త చిత్రం 'మదరాసి' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మదరాసి(Madharaasi)ప్రమోషన్స్ లో భాగంగా రుక్మిణి వసంత్ పలు ఇంటర్వూస్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సప్త సాగరాలు దాటి సినిమా గురించి మాట్లాడకుండా మరో చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకునే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకోలేనని కూడా అనుకుంటున్నాను. చిత్రసీమలో ఆ మూవీ రెండో జీవితాన్ని ఇచ్చింది. సప్తసాగరాలు ధాటి రాకముందు, ఇండస్ట్రీని వదిలి మరో ఉద్యోగం చేసుకోవాల్సివస్తుందా అని అనుకునే దానిని అని రుక్మిణి చెప్పుకొచ్చింది.

బెంగుళూరు కి చెందిన 'రుక్మిణి వసంత్' 2019 లో 'బీర్బల్ త్రయం కేస్ 1 'అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. దాంతో అదే ఏడాది హిందీలో 'అప్ స్టార్స్' అనే సినిమాలో చిన్న రోల్ లో చేసింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి సప్తసాగరాలు దాటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1), 'యష్'(yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)చిత్రాలు రుక్మిణి వసంత్ చేతిలో ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.