English | Telugu

శ్వేతాబసుకు అండగా టాలీవుడ్, బాలీవుడ్..!

ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతాబసు విషయంలో మీడియా,పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకూ కొంతమంది సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా శ్వేతాబసుకు మద్దతుగా హిందీ టీవీనటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు డైరెక్టర్ రాజమౌళి తన మద్దతు ప్రకటించాడు. సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలు ఇవి..? శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు చూసిన శ్వేత బసు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులెవరు? సున్నితమైన విషయాన్ని ఎందుకు బజారుకీడ్చారు? ఈ ప్రశ్నలకు డైరెక్టర్ రాజమౌళి తన మద్దతు తెలిపారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.