English | Telugu

ప్రభాస్ "రెబెల్" విదేశాలకు

ప్రభాస్ "రెబెల్" విదేశాలకు వెళ్ళారు. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "రెబెల్". ఈ ప్రభాస్ "రెబెల్" విదేశాలకు వెళ్ళిందని సమాచారం. బ్యాంకాక్ లో ఈ ప్రభాస్ "రెబెల్" షూటింగ్ జరపనున్నారు. బ్యాంకాక్ లో ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రం తాలూకు కొన్ని కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ సన్ని వేశాలనూ, రెండు పాటలనూ బ్యాంకాక్ లో చిత్రీకరిస్తారని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి.

దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నారట. ప్రభాస్ "రెబెల్" సినిమా 2012 లో రానున్న వేసవి శలవుల కానుకగా విడుదల కానుందని సమాచారం. "మిస్టర్ పర్ ఫెక్ట్" వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావటం వల్ల దీని మీద ప్రభాస్ అభిమానులకూ, ప్రేక్షకులకూ భారీ అంచనాలున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.