English | Telugu

పోసానిపై  పోలీసు కేసు..


పోసాని కృష్ణ మురళికి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన పోసాని ఆ తర్వాత దర్శకుడుగా,నటుడుగా ఒక రేంజ్ లో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మురళి పై పోలీస్ కేసు నమోదు చెయ్యమని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

ఒకప్పటి పోసాని వేరు ఇప్పటి పోసాని వేరు అనేలా ప్రస్తుతం పోసాని తీరు ఉంది.ఒకప్పుడు తన పెన్ను మాత్రమే మాట్లాడేది ఇప్పుడు ఆయన నోరు మాత్రమే మాట్లాడుతుంది. కొన్న్ని రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోసాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీంతో రాజమండ్రి కి చెందిన పవన్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో పోసాని తమ నాయకుడి పై నిరాధార ఆరోపణలు చేసాడని చెప్పి పోసాని పై పోలీసు కేసు నమోదు చేసేటందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ లు కేసు స్వీకరించలేదు. దీంతో జనసేన నాయకులు కోర్ట్ ని ఆశ్రయించడంతో పోసాని మీద కేసు నమోదు చెయ్యవలసిందిగా కోర్ట్ పోలీసులని ఆదేశించింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.