English | Telugu

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బ్యాడ్ న్యూస్

పవన్ సినీ అభిమానులకు గుడ్ న్యూస్..రాజకీయ అభిమానులకైతే ఇది బ్యాడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణిస్తున్నాడు కాబట్టి. ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ తో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ఓ షాకింగ్ డేసిజన్ తీసున్నాడట. అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్నయించుకున్నాడట. ఇది కూడా తన అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే.

గత కొంతకాలంగా సినిమాలు చేయకుండా ఖాళీగా వున్న పవన్, తన ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు సర్దార్ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి వారికి అందించాలని నిర్నయించుకున్నాడట. దీని కోసం చిత్ర యూనిట్ కూడా డెడ్ లైన్ పాస్ చేశాడట. ఈ సినిమాను ఎట్టి పరిస్థితులో డీలే అవకుండా ఫినిష్ చేయాలని చెప్పాడట. ఇది సినిమా అభిమానులకు శుభవార్తే. కానీ రాజకీయాలలో ఇప్పటికే యాక్టివ్ గా లేకుండా విమర్శలు ఎదురుకుంటున్న పవన్ , ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ అభిమానులకు బ్యాడ్ న్యూస్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.