English | Telugu

జూలై 25 నుండి పవన్ గబ్బర్ సింగ్ షూటింగ్

జూలై 25 నుండి పవన్ "గబ్బర్ సింగ్" షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రవితేజ హీరోగా "షాక్, మిరపకాయ్" సినిమాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి మాతృక హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా "దబాంగ్" సినిమా అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా ఎవరెవరినో హీరోయిన్లుగా అనుకున్నా చివరికి పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించే అదృష్టం శృతి హాసన్ కి దక్కిందని తెలిసింది. జూలై 25 నుండి పవన్ "గబ్బర్ సింగ్" షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించి, ఆగస్ట్ నుండి హీరో పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని తెలిసింది. ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమా తమిళంలో కూడా శింబు, రీచా గంగోపాథ్యాయ జంటగా రీమేక్ చేయబడుతూంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.