English | Telugu

పవర్ స్టార్ జైలుకు వెళ్తాడట..!!

పవన్‌ కళ్యాణ్‌ కి ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ వేసిన జోక్స్ కి కోపం వచ్చిందో ఏమో తెలియదు గానీ, మొన్న ప్రెస్‌మీట్‌లో తాను చేసిన విమర్శలకు రాజకీయ నాయకులు మండిపడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ట్విట్టర్ ద్వార పవన్ వారి విమర్శలకు సమాధానమిచ్చారు. మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు.. కేసులు పెడుతున్నారని.. జైళ్లు.. కోర్టులు ఎదుర్కొనటానికి సంతోషంగా ఎదురుచూస్తానని.. ఆ పనేదో త్వరగా చేయాలన్నట్లుగా ఆయన ట్వీట్‌ చేశారు.

"సీమాంధ్ర ఎంపీలు పౌరషం నామీద కాదు.. కేంద్రం మీద చూపించండి” అంటూ తొలి పంచ్‌ ఇచ్చిన పవన్‌.. ఆ తర్వాత ”నన్ను తిడితే ప్రత్యేక హోదా రాదు” అంటూ మరో ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ముచ్చటగా మూడో ట్వీట్‌లో.. ”ఎంపీలు వ్యాపారాలు చేయడం తప్పు కాదు.. ‘వ్యాపారాలు’ మాత్రమే చేయడం తప్పు” అంటూ సెటైర్‌ వేశారు. ఐతే ఇంతకుముందులా సైలెంటైపోకుండా.. పవన్‌ వెంటనే ఈ విమర్శలపై స్పందించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.