English | Telugu

ఎన్టీఆర్ పుట్టినరోజున 'రభస' టీజర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రభస'. ఈ వేసవిలోనే ధియేటర్లలో రభస చేయాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా స్క్రిప్ట్ సరిగా లేదని కొన్ని రోజులు ఆతరువాత డైరెక్టర్ శ్రీనివాస్‌కు జాండిస్ అటాక్ కావడంతో మరి కొన్ని రోజులు సినిమా షెడ్యూల్స్ డిలే అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ టీజర్ ను యంగ్ టైగర్ బర్త్ డే కానుకగా మే20న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, ప్రణీత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.