English | Telugu

డిసెంబర్ 22న 1 పాటలు

మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. "1 నేనొక్కడినే" పాటలను డిసెంబర్ 22న హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేయనున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. హాలీవుడ్ హీరో రెంజులో మహేష్ కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత క్రేజ్ ని పెంచేలా చేసాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.