English | Telugu
అప్పుడే ఓటీటీలోకి 'గామి'..!
Updated : Mar 18, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ ఫిల్మ్ 'గామి'. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. మంచి అంచనాలతో మార్చి 8న విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ కూడా రావడంతో మంచి వసూళ్లతో విజయాన్ని సాధించింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'గామి' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 దక్కించుకుంది. ఇప్పటికే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది అన్నమాట.
కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాకి నరేశ్ కుమారన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా విశ్వనాథ్రెడ్డి, ఎడిటర్ గా రాఘవేంద్ర తీరున్ వ్యవహరించారు.