English | Telugu

ప్రభాస్ కి అంతర్జాతీయ పబ్లిసిటీ

బాహుబ‌లి సంబంధించిన క్రెడిట్ మాత్రం ప్ర‌భాస్ కి ద‌క్క‌లేదు. ఇది రాజ‌మౌళి సినిమా సినిమాగానో, రానా సినిమాగానో చ‌లామ‌ణీ అవుతోంది. ఇప్పటి వ‌ర‌కూ ప్ర‌భాస్‌ని అక్క‌డ ప‌ట్టించుకొన్న‌దే లేదు. బాహుబ‌లి టీమ్ కూడా బాహుబ‌లిని రానా సినిమాగానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. దీంతో కొంచెం ఫీలయిన ప్రభాస్ తెలివిగా ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపి ప్రముఖులను కలవడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. దీంతో ఒక్కసారిగా మనోడు అంతర్జాతీయ స్టార్ అయిపోయాడు. ఫోర్బ్స్ లోకి ఎక్కాడు.

మనోడి మీద ఓ రేంజిలో ప్రశంసలు కురిపించింది ఫోర్బ్స్. ప్రధాని మోదీ తన పనులన్నీ పక్కనబెట్టి మీట్ అయిన ట్వీట్ చేసిన హీరో ఇతనంటూ పరిచయం చేసి.. ప్రఖ్యాత హాలీవుడ్ హీరోలు హారిసన్ ఫోర్డ్ ఎలిజా వుడ్ లతో పోలిక పెట్టింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మారుమోగిపోతోందో ఫోర్బ్స్ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ కథనం చూసి మనోడి రేంజి ఏ స్థాయికి వెళ్లిపోయిందో అంటూ టాలీవుడ్ సెలబ్రెటీలంతా ట్విట్టర్లో సందడి చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.