English | Telugu

సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం     

-చిరంజీవి, నాగార్జున ఏం చెప్పబోతున్నారు
-సజ్జనార్ తో భేటీ
-అభిమానులు హ్యాపీ
-ఐ బొమ్మ మైండ్ బ్లాక్

పైరసీతో తెలుగు సినిమాని భయబ్రాంతులకి గురి చేస్తున్న ఐబొమ్మ(Ibomma)నిర్వాహకుడు రవిని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవిని కస్టడీ కి తీసుకొని మరింతగా విచారణ జరపడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక రవి అరెస్ట్ తో అయితే తెలుగు సినిమాతో పాటు సినీ ప్రతినిధుల్లో పండుగ వాతారవరణం వచ్చిందని చెప్పవచ్చు.


రీసెంట్ గా రవి అరెస్ట్ విషయంపై మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),కింగ్ నాగార్జున(Nagarjuna)సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్(Vc Sajjanar)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాల గురించి ఆ ఇద్దరు సజ్జనార్ తో చర్చించనున్నారు . పూర్తి వివరాలు భేటీ అనంతరం బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పైరసీ పై సుదీర్ఘ కాలంగా చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

also read: సిద్దార్ధ్ వైఫ్ అదితిరావుహైదరీ పేరుపై మెసేజెస్.. నమ్మచ్చా!


ఇక ఇప్పటికే రవికి సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, వెబ్‌ లాగిన్‌లు, సర్వర్‌ వివరాలకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ తో పాటు మరో సైట్ బెప్పం టీవీ లని క్లోజ్‌ చేయించారు. రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌డిస్క్‌లను పరిశీలనకి పంపడంతో పాటు ఇప్పటివరకు అతను అక్రమంగా సంపాదిచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్నీ కూడా పరిశీలించడంతో పాటు రవి వెనక ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఆరాతీస్తున్నారు.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.