English | Telugu

బాలయ్య న్యూ ట్రెండ్.. త్రీడీ సెట్ లో 'లయన్' ఆడియో

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లయన్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘లయన్' ఆడియోను ఏప్రిల్ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో కోసం ప్రత్యేకంగా మొదటిసారి త్రీడీ సెట్‌ను వేయిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సీబీఐ ఆఫీసర్‌గాను, సామాన్యుడిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధికాఆఫ్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.