English | Telugu

బాహుబ‌లి దెబ్బ‌కు.. మ‌గ‌ధీర ఉష్ ప‌టాక్‌...!



అనుకొన్న‌దంతా అవుతోంది. బాహుబ‌లి దెబ్బ‌కు రికార్డుల‌న్నీ చల్లాచెదురైపోతున్నాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు లిఖిస్తూ... ప్ర‌భాస్ - రాజ‌మౌళిల క్రేజీ చిత్రం `బాహుబ‌లి` దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే చాలా మ‌ట్టుకు రికార్డులు చెదిరిపోయాయి. ముఖ్యంగా `మ‌గ‌ధీర‌` రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టింది. మ‌గ‌ధీర ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రోజుల‌కూ క‌ల‌పి రూ.150 కోట్ల గ్రాస్‌ సాధించింది. దాన్ని కేవ‌లం మూడు రోజుల్లోనే అధిగ‌మించి మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. శుక్ర‌, శ‌ని, ఆదివారాలు త‌న జోరు చూపించిన బాహుబ‌లి..

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.160 కోట్లు సాధించాడు. దాంతో చ‌ర‌ణ్ రికార్డు గ‌ల్లంత‌య్యింది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇండ్ర‌స్ట్రీ రికార్డ్ `అత్తారింటికి దారేది`ని మాత్రం ఇప్పుడు మిగిలి ఉంది. తొలి వారంలో అత్తారింటికి దారేది రికార్డ్ కూడా చెదిరిపోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌లో రూ.100 కోట్లు సృష్టించిన చిత్రం.. అత్తారింటికి దారేది. ఈ రికార్డును తొలి వారంలోనే `బాహుబ‌లి` అందుకోబోతోంది. మ‌రోవైపు బాలీవుడ్ రికార్డు చిత్రాలు పీకే, హ్యాపీ న్యూయిర్‌ల రికార్డులు కూడా బాహుబ‌లి ముందు బోసిబోతున్నాయి. ఈ హ‌వా ఎన్ని రోజులు కొన‌సాగుతుందో, ఇంకెవ‌రెవ‌రి రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.