English | Telugu

అత్తారింటితో అభిమానులకు విందు భోజనం

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రానికి మంచి టాక్ లభిస్తుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ అదరగొట్టే నటనతో అభిమానులను అలరిస్తున్నారు. ప్రతి సన్నివేశంలో పంచ్ లు టపాసుల్లా పేలుతున్నాయి. ఇందులో పవన్ చేసిన లుంగీ డాన్స్ కు అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం అభిమానులకు పెద్ద పండగలా ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్లుగా నటించిన సమంత, ప్రణీత లు పోటాపోటీగా నటించారు. మొత్తానికి ఇన్నిరోజులు పవన్ సినిమా కోసం వేచి చుసిన అభిమానులకు విందు భోజనమే దొరికింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.