Read more!

English | Telugu

ప్చ్‌.. మ‌ళ్లీ కొడుకే ముంచేశాడు

అల్లుడు శీను దెబ్బ‌కు ఇంకా తేరుకోలేదు బెల్లంకొండ సురేష్‌. త‌న కొడుకుని పెద్ద హీరో చేయాల‌న్న ఆశ‌యంతో తొలి సినిమాకే ఏకంగా రూ.43 కోట్లు ఖ‌ర్చుపెట్టాడు. పేరున్న టెక్నీషియ‌న్స్‌ని తీసుకొచ్చాడు. హీరోయిన్ల‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడిందంతే. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఓపెనింగ్స్ మాత్రం బాగా వ‌చ్చాయి. ఎన్ని టికెట్లు తెగినా... ఆ సినిమా ద్వారా బెల్లంకొండ దాదాపు రూ.10 కోట్లు న‌ష్ట‌పోయాడ‌ని, ఆ దెబ్బ‌తోనే సినిమాల‌కు దూర‌మ‌య్యాడ‌ని టాక్‌.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ కొడుకే ముంచేశాడు. శ్రీ‌నివాస్ రెండో సినిమా స్పీడున్నోడు ఈమ‌ధ్యే విడుద‌లైంది. నిర్మాత‌గా భీమినేని శ్రీ‌నివాస‌రావు పేరున్నా... వెనుక నుంచి డ‌బ్బులు పెట్టింది మాత్రం బెల్లంకొండ సురేషేన‌ట‌. రూపాయి ఖ‌ర్చ‌పెట్టాల్సిన చోట త‌న కొడుకు కోసం ప‌ది రూపాయలు ఖ‌ర్చుపెట్టాడ‌ట‌. దాంతో సినిమా రిచ్‌గా వ‌చ్చింది. రిజ‌ల్ట్ తో తాను మాత్రం `పూర్‌` అయిపోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఫైట్లూ, పాట‌లూ, త‌న‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్‌,యాడ్లూ.. వీటి కోసం బెల్లంకొండ సురేషే ఖర్చుపెట్టాడ‌ట‌. ఆ మొత్తం ఏకంగా రూ.6 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. ఇప్పుడు ఈ సినిమాని కొన్న బ‌య్యర్లు తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వాళ్ల‌కూ ఎంతో కొంత డ‌బ్బు స‌ర్దుబాటు చేయాలి. ఆ బాధ్య‌త కూడా బెల్లంకొండ సురేష్‌పైనే ప‌డింద‌ని టాక్‌. అలా... రెండో సినిమా కూడా ఈ తండ్రీ కొడుకుల‌కు నిరాశ‌నే మిగిల్చింద‌న్న‌మాట‌.