English | Telugu

అల్లుడొచ్చాడు...ఇరగదీసాడు...

రజనీకాంత్‌కు అల్లుడు కావడానికి ముందే ధనుష్ హీరో అయినప్పటికీ.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను అర్ధాంగిగా చేసుకున్నాక అతని పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా "వై దిస్ కొలవరి" పాటతో అతని గొంతు మాత్రమే కాదు, పేరు కూడా ప్రపంచవ్యాప్తమైపోయింది.

ఇప్పుడు తాజాగా "రాన్‌ఝన్నా" చిత్రంతో మరోసారి అందరి దృష్టిని అతగాడు అమితంగా ఆకర్షిస్తున్నాడు. సోనమ్‌కపూర్ జంటగా "తను వెడ్స్ మను" ఫేమ్ ఆనంద్ రాయ్ దర్శకత్వంలో రూపొంది నిన్న విడుదలైన "రాన్‌ఝన్నా"కు విపరీతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ధనుష్ పెర్‌ఫార్మెన్స్‌కు ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. మన సౌతిండియా హీరోస్‌లో ఎవరికీ లేని విధంగా రజనీకాంత్‌కు హిందీలో మంచి మార్కెట్ ఉంది. "శివాజి, రోబో" వంటి చిత్రాలు అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు రాన్‌ఝన్నా" చిత్రంతో ధనుష్ కూడా బాలీవుడ్‌లో మంచి బోణీ కొట్టడం ద్వారా.. "మామకు తగ్గ అల్లుడు" అనిపించుకుంటున్నాడు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.