English | Telugu

ముగ్గురమ్మాయిలతో 'అల్లు అర్జున్'..!

'జులాయి' సినిమా తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకరిగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ హీరోయిన్లలనూ ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ త్రివిక్రమ్‌ బిజీగా వున్నారట. అయితే ఈ సినిమా జనవరిలోనే మొదలు కావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 'జులాయి' చిత్ర నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అల్లు అరవింద్‌ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' విడుదలకు సిద్దమవుతుంది. సురేందర్‌రెడ్డి, అల్లుఅర్జున్‌ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు వున్నాయి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.