English | Telugu

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 67,767 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,852 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.