English | Telugu
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Updated : Aug 26, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. అయితే వినాయక చవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఆగస్టు 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఆగస్టు 26) శ్రీవారిని మొత్తం 77 వేల 837 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 510 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.